టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. “కింగ్డమ్” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడిప్పుడే ఈ సినిమాకి సంబంధించి ఓ తాజా ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. సమాచారం మేరకు కింగ్డమ్ చిత్రబృందం ట్రైలర్ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక ట్రైలర్ను పూర్తిగా రెడీ చేసిన తర్వాత, చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ అప్డేట్తో సినిమాపై మళ్లీ క్రేజ్ పెరిగేలా కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్కి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ పని చేస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్కి సంబంధించి అధికారిక సమాచారం త్వరలోనే బయటకి వచ్చే అవకాశముంది. దీంతో సినిమాపై మళ్లీ హైప్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.