తెర వెనుక పాపులెవరో కృష్ణంరాజు చెప్పాల్సిందే!

‘అమరావతి అనేది వేశ్యల రాజధాని’ అనే అత్యంత నీచమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజు ప్రస్తుతం రిమాండ్లో గుంటూరు జైలులో ఉన్నారు. ఆయనను మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ తాజాగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పోలీసులు ఆయనను తమ కస్టడీలో ఉంచుకుని విచారించనున్నారు. కనీసం ఈ విచారణలో అయినా కృష్ణంరాజు నిజాలు వెల్లడిస్తే ఆయనకు మంచిదని, జర్నలిస్టు అనే పదానికి ప్రజలలో ఉండే కనీస గౌరవాన్ని ఆయన కాపాడిన వ్యక్తి అవుతారని ప్రజలు భావిస్తున్నారు. సాక్షి ఛానల్ కె ఎస్ ఆర్ లైవ్ షో చర్చా వేదికలో పుట్టిన ఈ వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగానే యోహాత్మకంగానే ముందస్తు ప్లాన్ ప్రకారమే వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరి ప్రేరేపణ ఉన్నదో, ఎవరి ప్రయోజనాలను ఆశించి, లేదా ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి కృష్ణంరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారో ఆయన స్వయంగా పోలీసు విచారణలో వెల్లడించాల్సి ఉంది.

కేఎస్ఆర్ లైవ్ షో లో అమరావతి నగరం గురించి గానీ అక్కడి సెక్స్ వర్కర్ల వ్యవహారం గురించి గానీ ఎలాంటి ప్రస్తావన లేకుండానే.. అసందర్భంగా కృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదో దిశగా సాగుతున్న చర్చలో ఆయన అప్రస్తుత ప్రసంగం తరహాలో మాట్లాడారు. అమరావతి ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానిని నిందించడానికి ప్రయత్నించిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అంటున్నారు కదా అని వెటకారంగా మాట్లాడినప్పుడు.. దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా ఇలా మాట్లాడితే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అంటూ కృష్ణంరాజు మీదనే సానుభూతి, ప్రేమ వ్యక్తం చేయడం కె ఎస్ ఆర్ చేసిన పాపం.  ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందుగా ప్రిపేర్ అయి వచ్చినట్లుగా కృష్ణంరాజు సెక్స్ వర్కర్ల గణాంకాలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో ఉన్నదన్నట్లుగా తెలియచెప్పే ఒక ఆంగ్ల పత్రిక పేపర్ క్లిప్పింగ్ ప్రదర్శించారు. అంటే అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడానికి ఆయన ముందస్తు ప్రిపరేషన్ తోనే చర్చా కార్యక్రమానికి వచ్చారని అర్థమవుతుంది. స్వబుద్ధితోనే ఆ పని చేశారా లేదా చర్చలో ఆ టాపిక్ తేవలసిందిగా ఎవరైనా ప్రేరేపిస్తే ఆ పని చేశారా అనేది పోలీసులు తేల్చవలసి ఉంది.

వివాదం రేగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, భారతిని మహిళలు సాధారణ ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసిన తర్వాత సాక్షి మీడియా గ్రూపు కాస్త జాగ్రత్త పడింది. కృష్ణంరాజుతో తమకు సంబంధం లేదన్నట్లుగా ఆ వ్యాఖ్యలు ఆయన సొంతం అంటూ చేతులు దులుపుకున్నారు. ఆయనకు ఎలాంటి శిక్షలు అయినా వేసుకోండి మాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కృష్ణంరాజు ఇప్పుడు జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి ఆ వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటారా.. తద్వారా తీవ్ర శిక్షలు అనుభవించడానికి సిద్ధమవుతారా? లేదా, తన ద్వారా ఆ వ్యాఖ్యలు చేయించిన తెరవెనుక పెద్దల గురించి వాస్తవాలను పోలీసు కస్టోడియల్ విచారణలో బయటపెట్టి జర్నలిజం వృత్తి గౌరవాన్ని కాపాడుతారా? అనేది వేసి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories