టాలీవుడ్ లో మంచి అంచనాల మీద తెరకెక్కుతున్న చిత్రాల్లో “కుబేర” కూడా ఒకటి. ఈ సినిమాలో కింగ్ నాగార్జున మరియు ధనుష్ ఇద్దరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫీమేల్ లీడ్ గా రష్మిక మందన్నా కనిపించనుండగా, సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై మొదటి నుంచి ఆసక్తికరమైన బజ్ కనిపిస్తోంది.
తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఆ రెండు ఇండస్ట్రీల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథ మాత్రం పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతోంది. ఓ బిచ్చగాడు మరియు ఓ బిలియనీర్ మధ్య జరిగే కాంట్రాస్ట్ ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం. ఇందులో నాగార్జున పాత్ర చాలా బలమైనదిగా ఉండనుందని టాక్. అలాగే ధనుష్ క్యారెక్టర్ లోనూ మాస్ అండ్ క్లాస్ మిక్స్ కనిపించేలా మేకింగ్ ఉంది.
ఇప్పటికే అమెరికాలో కుబేర ప్రీమియర్ షోస్ కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే సుమారు లక్ష యన్నబై వేల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు రెండు లక్షల డాలర్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఇది చూసి ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, పాన్ ఇండియా స్థాయిలో జూన్ 20న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, స్టార్ కాస్టింగ్, అలాగే శేఖర్ కమ్ముల మ్యాజిక్ కలిసొస్తే “కుబేర” మంచి విజయం సాధించగలదని టాక్ ఉంది.