పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ “ది రాజాసాబ్” ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విభిన్నమైన కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్ తో టీజర్ ఓకే అని కాకుండా, చాలా బాగా వచ్చింది అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది.
ఇప్పటికే “ది రాజాసాబ్” సినిమా పట్ల బాక్సాఫీస్ స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీనికి కారణం టీజర్ ద్వారా వచ్చిన పాజిటివ్ బజ్ కావచ్చు లేదా ప్రభాస్ స్టార్డమ్ కావచ్చు కానీ, సినిమా బిజినెస్ మాత్రం ఊహించని స్థాయిలో జరుగుతోంది. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులు ఏకంగా రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయట. టీ సిరీస్ అనే ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఈ హక్కులను దక్కించుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇంతవరకూ ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు అనే విషయం ఇక్కడ గమనించాలి.
ప్రభాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, మేకింగ్ అన్నీ కలిసి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక కథ విషయానికి వస్తే, ఇందులో డార్లింగ్ ప్రభాస్ మరో మాయాజాలం చూపించబోతున్నాడనే మాట వినిపిస్తోంది. హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుండగా, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి. విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ అభిమానులకే కాదు, సినిమా ప్రేమికులందరికీ “ది రాజాసాబ్” సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆడియో రైట్స్ హై ప్రైస్కు అమ్ముడవ్వడం చూస్తుంటే, ఈ సినిమా ఎంత స్థాయిలో హైప్లో ఉందో అర్థం అవుతోంది.