అక్కినేని ఇంట్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. ఆ కుటుంబానికి చెందిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ముంబైకి చెందిన జయినాబ్ రవడ్జీతో అఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3:35కి ఈ పెళ్లి కార్యక్రమం జరిగినట్టు సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక సంపూర్ణంగా ప్రైవేట్ గా జరిగింది.
ఈ వివాహం కోసం నాగార్జున, అమల సహా మొత్తం అక్కినేని కుటుంబం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ పెళ్లి జరగడం కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. అఖిల్ – జయినాబ్ జంటను చూసిన అభిమానులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక అక్కినేని నాగార్జున కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ముఖ్యమైన క్షణం చివరకు వచ్చిందని, తమ ఇంట్లో శుభం నెలకొందని ఆయన భావోద్వేగంగా తెలిపారు. కొత్త జంట జీవితంలో ఆనందం నిండాలని కోరుతూ అభిమానులు, పరిశ్రమలోని ప్రముఖులంతా ఆశీర్వచనాలు అందజేస్తున్నారు.
ఈ వేడుకతో అక్కినేని ఇంట ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ – జయినాబ్ కొత్త జీవితంపై పడింది.