నిర్మాతకు 11 కోట్లు ఇచ్చిన పవన్‌!

టాలీవుడ్‌ నుంచి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఎప్పటి నుంచో భారీ ఆసక్తి కొనసాగుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో స్పష్టత రాకపోవడం వాళ్ల ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

ఇటీవలి రోజులలో ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభమవ్వడం చూసి ఇక ఫైనలీ రిలీజ్‌కు రెడీ అయిపోయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ వాయిదా చర్చలు వినిపించడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి కారణం నిర్మాత ఏఎం రత్నం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులేనన్న మాట వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆయన ఎంతగానో కష్టపడ్డారని అందరికీ తెలుసు.

తాజాగా ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆయన చిత్రానికి తీసుకున్న రూ.11 కోట్లు అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశారని, నిర్మాతపై ఆర్థికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమా విడుదల చేసుకోవచ్చని చెప్పారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ టాక్ బాగా పాపులర్ అయింది. దీని వలన సినిమాపై మరోసారి ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి వాయిదా రూమర్స్ నిజమవుతాయా లేక సినిమాను టైమ్‌కు విడుదల చేస్తారా అన్నది చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories