వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయనను అనేక విషయాలలో బైపాస్ చేస్తూ తానే ముఖ్యమంత్రి లాగా వ్యవహరించేవారు సమాధాన హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి మాట్లాడవలసిన అవసరం ఉన్నదని ప్రజలు భావించే వివిధ అంశాలపై, తగుదినమ్మ అంటూ సద్దుల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి తన చాతుర్యం చూపించేవారు. ముఖ్యమంత్రి తరఫున మంత్రులను అజమాయిషి చేయడం వరకు అన్ని రకాల పనులను తానే చక్కబెట్టే వారు. పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోయి ఇంటికి పరిమితమైన తర్వాత కూడా.. జగన్మోహన్ రెడ్డిని బైపాస్ చేయడం, ఆయన తరఫున తానే కీలకంగా వ్యవహరించడం అనేది సజ్జల ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సోమవారం నాడు రౌడీయిజం చేసినందుకు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం కిషోర్ ను, మరో రౌడీషీటర్ వారి పార్టీ నాయకుడు త్వరగా కిషోర్ ను ములాఖాత్ రూపంలో పరామర్శించడానికి కూడా సజ్జన రామకృష్ణారెడ్డి మాత్రమే వచ్చారు. గతంలో ఇలాంటి మలాఖత్ లకు స్వయంగా జగన్ వచ్చేవారు. ఇప్పుడు ఆయనను ఆ పని కూడా చేయనివ్వడం లేదు అన్నట్లుగా కనిపిస్తోంది.
పార్టీ నాయకులు ఎంత పెద్ద తప్పుడు పనులు చేసి అయినా సరే అరెస్టు అయి జైలుకు వెళ్లిన తర్వాత.. వారిని పరామర్శించడం పేరిట అధినేత వెళ్లడం మామూలే. అలా కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తల్ని నాయకుల్ని పరామర్శిస్తూ ఉంటేనే పార్టీని కాపాడుకోవడం సాధ్యం అవుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ప్రతి వారం బెంగుళూరు వెళ్లిపోతూ.. ఏదో ఒకరోజు కాస్త ఖాళీ దొరికినప్పుడు తాడేపల్లికి వస్తూ ఒకటి రెండు సమావేశాలు పెట్టి తిరిగి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు పారిపోతున్న జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా నాయకులు జైలు పాలైనప్పుడు ములాఖత్ లకు తానే వెళుతూ వచ్చారు.
ఇప్పుడు చూడబోతే కనీసం ఆ పని చేయడానికి కూడా ఆయనకు టైం లేదేమో.. యలహంక నుంచి బయటకు రాబుద్ధి కావడం లేదేమో అనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ ఆయనను బైపాస్ చేస్తూ అధికారాలన్నీ తానే చెలాయించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు ములాఖత్ లకు కూడా తానే వెళుతున్నారు. జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడి, వాస్తవ పరిస్థితులను ఆయన దృష్టికి వెళ్లనివ్వకుండా చేస్తూ.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ నుంచి బయటకు వెళ్లిన చిన్నా పెద్దా నాయకులు ప్రతి ఒక్కరూ ఆరోపించారు. అయినా ఇప్పటికీ జగన్, సజ్జల మీదనే ఇంత అతిగా ఆధారపడడం అనేది పార్టీకి మంచిది కాదని ఇంకా ఆ పార్టీలో మిగిలిఉన్నవారు కూడా ఆవేదన చెందుతున్నారు.