బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన మనసులో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం తన మొత్తం దృష్టి ‘సితారే జమీన్ పర్’ మీదే ఉందని చెప్పిన అమీర్, మహాభారతం ఆధారంగా ఒక భారీ సినిమా చేయాలన్నది తన కల అని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్పై పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నట్లు చెప్పారు.
మహాభారతం కథలో ఉన్న గంభీరత, భావోద్వేగాలు, జీవన విలువలు ప్రపంచంలోని ప్రతి మూలకు వర్తిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ యుగానికి చెందిన ప్రేక్షకులకు దాన్ని సరైన రూపంలో చూపించాలంటే పెద్ద స్థాయిలో ప్రయత్నం చేయాల్సి ఉంటుందని అమీర్ అభిప్రాయపడ్డారు. ఈ కథను తెరపై చూడాలన్న తన కోరిక చాలా ఏళ్లుగా తనను వెంటాడుతూనే ఉందని, ఆ కలను నిజం చేయడానికి తగిన సమయం రావాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
ఇంకా తాను ఒకటే విషయం అనుకుంటున్నానని చెప్పారు, అది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఇక నటుడిగా తనకు సాధించాల్సింది ఏమీ మిగిలిపోదని. ఒక నటుడిగా తన ప్రయాణం ఇంతవరకు చాలనిపిస్తుందని, ఆ స్థాయిలో ఈ సినిమా ఉండాలని ఆశపడుతున్నారని చెప్పారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తనకు మాత్రమే కాదు, ప్రేక్షకులకూ గుర్తుండిపోయేలా ఉండాలనేది ఆయన ఆశ.