టాలీవుడ్ టాలెంటెడ్ యువ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే నారా రోహిత్ ల కలయికలో నాంది సినిమా ఫేమ్ దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “భైరవం”. అయితే ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ మెగా అభిమానులు ఊహించని విధంగా ట్రెండ్ చేయడం ఇపుడు అందరికీ పెద్ద షాకిచ్చింది.
అయితే దీనికి కారణం గతంలో ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి తో పాటు చరణ్ లపై మార్ఫ్ ట్రోల్స్ ని షేర్ చేయడమే అని మెగా అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. అయితే దీనిపై దర్శకుడు స్పందించడం జరిగింది. ఇన్నిరోజులు తనకి అండగా ఉన్న మెగా అభిమానులు ఇపుడు ఒక్కసారిగా తనకి వ్యతిరేకం కావడం పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.
నేను మెగా హీరోలు అందరి సినిమాలకి పని చేశాను. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ లతో వారు ఎంతో ఎంకరేజ్ చేసేవారని తెలిపారు. నేను కూడా మీ అందరిలో ఒకడినే అంటూ మెగా అభిమానులకి క్షమాపణ చెప్పుకుంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది.