చరణ్‌ విగ్రహంతో చిరు ఫ్యామిలీ క్యూట్‌ మూమెంట్స్!

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు రామ్ చరణ్‌కు లండన్‌లో మరో విశేషమైన గౌరవం లభించింది. ప్రపంచంలో ప్రముఖంగా పేరుగాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విగ్రహాన్ని రామ్ చరణే స్వయంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. చిరంజీవి, సురేఖ, ఉపాసనతో కలిసి చరణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు అంతర్జాతీయంగా విపరీతమైన గుర్తింపు వచ్చింది. దాంతో గ్లోబల్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణం.

ఇప్పుడు చరణ్ మైనపు విగ్రహం ముందూ మెగా ఫ్యామిలీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ఈ ఫోటోల్ని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories