సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ లెవెల్ హైప్ దీనిపై ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ గానే మొదలైనా ఇపుడు శరవేగంగా పూర్తవుతున్నట్లు తెలుస్తుంది.
ఇలా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ సినిమాపై ఇపుడు వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం అప్పుడే మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యిపోయిందట. దీనితో జక్కన్న అండ్ టీం సైలెంట్ గా అంతే వేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ కొత్త షెడ్యూల్ లో నటి ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ భారీ మూవీ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అని తెలుస్తుంది.