మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో చేస్తున్న మోస్ట్అ వైటెడ్ మూవీ కూడా ఒకటి. అయితే ఆల్రెడీ తారక్ లేకుండా కీలక ఎపిసోడ్ ని నీల్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా కొంచెం గ్యాప్ తర్వాత మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని నేడు అందిస్తున్నట్టుగా తెలిపారు. మరి ఆ అప్డేట్ ఏంటో ఇపుడు బయటకి వచ్చేసింది.
దీనితో ఈ భారీ సినిమా సెట్స్ లో తారక్ ఎప్పుడు అడుగు పెట్టనున్నాడో రివీల్ చేశారు. దీంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ ఏప్రిల్ 22 నుంచి అడుగు పెట్టబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీంతో ఓ క్రేజీ ఎపిసోడ్ లో తారక్ జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ గా విడుదలకి మేకర్స్ రెడీ అవుతున్నారు.