No menu items!
No menu items!

28 కోట్ల ప్రాపర్టీ!

28 కోట్ల ప్రాపర్టీ! బాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్స్ లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వారిలో నటి కాజోల్ కూడా ఒకరు. అయితే కాజోల్ లస్ట్ స్టోరీస్ 2 తో మళ్ళీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలవగా లేటెస్ట్ గా ‘దో పట్టీ’తో పలకరించారు. అయితే ఆమెపై ఈ వెబ్ చిత్రం కాకుండా మరో షాకింగ్ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. కాజోల్ ఏకంగా 28.78 కోట్ల విలువ చేసే స్థలాన్ని కొనుగోలు చేసినట్టుగా ఇపుడు తెలుస్తుంది. 

బాలీవుడ్ కథనాలు ప్రకారం కాజోల్ భారత్ రియాలిటీ వెంచర్స్ నుంచి అంత మొత్తం పెట్టి ఒక రిటైల్ స్థలాన్ని కొనుకున్నారట. మొత్తం 4 వేల 365 చదరపు అడుగుల స్థలాన్ని ఒకో చదరపు అడుగు 65 వేల 940 రూపాయలు చెల్లించి కేవలం తన 5 కార్ల పార్కింగ్ కోసం ఆమె కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ వార్తలు ఇపుడు ఆమెపై సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం కాజోల్ హిందీలోనే పలు వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తున్నారు. అలాగే ఈ జూన్ 27న తన మా అనే సినిమా విడుదలకి రాబోతుంది.



Related Posts

Comments

spot_img

Recent Stories