బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలో ఊర్వశి రౌతేలాకి మంచి పాత్ర దక్కింది. ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే ప్రేక్షకులకు చేరువయ్యింది. ఈ నేపథ్యంలో ఊర్వశి రౌతేలాకి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో ఊర్వశి రౌతేలాకి ఛాన్స్ దొరికిందట. ఇప్పటికే, ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. వచ్చే షెడ్యూల్ లో ఊర్వశి రౌతేలా కూడా షూట్ లో జాయిన్ కానుంది.
కాగా ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్లో తారక్ లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఓ ప్రత్యేక సెట్ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో నటించనున్నాడు.
ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.