‘జార్జ్ రెడ్డి’, ‘పలాస 1978’ వంటి చిత్రాలలో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు నటుడు తిరువీర్. ఆ తరువాత మసూద, పరేషన్ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో ప్రేక్షకులను మరింతగా మెప్పించారు. ఇక తిరువీర్ కెరీర్లో మసూద బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం తిరువీర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అనే సినిమాలో ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్టర్ వహిస్తున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది.తిరువీర్ తన కొత్త మూవీ గురించి మాట్లాడుతూ.. “వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్రను పోషించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
మొబైల్తో చాలాసార్లు ఫోటోలు తీశాను. కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్గా అనిపిస్తోంది. స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి ఇలా చాలా విషయాల్ని నేర్చుకున్నాను. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పుకోచ్చారు.
తిరువీర్ తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ..‘మసూద తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాల్ని, కథల్ని ఎంపిక చేసుకుంటున్నాను. నాకు సరిపోయే కథల్ని మాత్రమే ఎంచుకుంటున్నాను. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కావడంతో ఆయా పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నాను. దర్శకనిర్మాతలు నా కోసం పాత్రలు, కథలు రాస్తుండటం ఆనందంగా ఉంది. ఇదే ఓ నటుడికి గొప్ప విజయం’ అని వెల్లడించారు.