ఆ పాటకు 20 కోట్లా..?

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌,  డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న భారీ బడ్జెట్  మాస్‌ యాక్షన్‌ సినిమా ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’, ‘రా మ‌చ్చా మ‌చ్చా’ పాటలకు సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది..

యూట్యూబ్ లో ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. డైరెక్టర్ శంక‌ర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌ట‌మే కాకుండా, అభిమానుల‌కు, ప్రేక్షకులకు సినిమా డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులకు అందిస్తుంటారు.

అయితే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త వినపడుతుంది. మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్‌కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ అన్న విషయం తెలిసిందే. కనువిందు చేసే సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌తో సగటు ప్రేక్షకుడిని ఆశ్చర్యచకితులను చేయించడం ఆయనకేమీ కొత్త కాదు. గతంలో తన సినిమాల్లో కూడా అలాంటి పాటలను చాలానే చూశాం. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ మీద తెరకెక్కించిన ఓ మెలోడి పాట కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అదిరిపోయే లొకేషన్స్‌లో హీరోహీరోయిన్ల మధ్య సాగిన ఈ సాంగ్ సూపర్ గా ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories