33 సంవత్సరాల తరువాత!

సుమారు 33 సంవత్సరాల తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు మణిరత్నం మరోసారి సినిమా తీయబోతున్నారు. 1991 లో వీరి కలయికలో వచ్చిన దళపతి సినిమా బాక్సాఫీస్‌ ను ఏ రేంజ్‌ లో షేక్‌ చేసిందో తెలిసిన సంగతే.ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా తీయలేదు. 33 ఏళ్ల తర్వాత ఈ హిట్‌ కాంబోలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతున్నట్లు కొన్ని వార్తలు షికారు చేశాయి. ఇప్పటికే రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ కుదిరితే డిసెంబరులో సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది.

ఈ వార్తలపై నటి, మణిరత్నం సతీమణి సుహాసిని తాజాగా స్పందించారు. రజనీకాంత్‌, మణిరత్నం కలయికలో సినిమా అంటూ వస్తున్న వార్తలు రుమార్స్‌ మాత్రమే అని సుహాసిని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియాతో సుహాసిని మాట్లాడుతూ… ‘రజనీకాంత్‌, మణిరత్నం కలయికలో ఎలాంటి సినిమా లేదు. అవి కేవలం రుమార్స్‌ మాత్రమే. బహుశా ఈ విషయం వాళ్లిద్దరికీ కూడా తెలిసి ఉండదేమో. రజనీ, మణిరత్నం సినిమా అంటూ జనాలు మాత్రమే రాస్తున్నారు’ అని సుహాసిని చెప్పుకొచ్చారు.

మరి ఈ హిట్‌ కాంబో ఎప్పుడో పునరావృతం అవుతుందో చూడాల్సిందే. రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయన్‌’ దసరాకు విడుదలైన విషయం తెలిసిందే.రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం 2025లో థియేటర్లలోకి రానుంది. జైలర్‌ 2 పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories