అయ్యో రామా..ఇదెక్కడి గోల!

ఈ ఏడాది చివరి నుంచే ‘మెగా’ హీరోల సందడి ఉంటుందని అనుకుంటున్నప్పటికీ.. అది కుదరలేదు. 2025 ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి వచ్చేందుకు మెగా కుటుంబం నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ చివరికి చేరుకుంది. ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నప్పటికీ.. అనధికారికంగా సంక్రాంతికి షిప్ట్ అయినట్టుగా సమాచారం.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి జనవరి 10న ‘విశ్వంభర’తో వస్తానని డేట్ లాక్ చేసి గట్టిగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. అదే డేట్‌కి గేమ్ ఛేంజర్‌ను తీసుకొచ్చేలా బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్లు మొదలు పెట్టారు. మరి చిరు ప్లేస్‌లోకి చరణ్ వస్తే.. విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే మెగాస్టార్‌ను చరణ్ టార్గెట్ చేస్తే.. ఇప్పుడు పవర్ స్టార్ డేట్‌ను మెగాస్టార్ టార్గెట్ చేసినట్టుగా వార్తలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ముందుగా ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను పవన్ మళ్లీ మొదలు పెట్టారు.  రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని మార్చి 28న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇదే డేట్‌కి విశ్వంభర విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అంటే ఇక్కడ చిరు, పవన్ ఇద్దరు బాక్సాఫీస్ బరిలో ఉంటున్నారని కాదు. ‘అన్నయ్య’ వస్తున్నాడంటే.. కచ్చితంగా ‘తమ్ముడు’ తన సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మార్చి 28న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా విడుదలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి మార్చి 28న ఎవరెవరు వస్తారో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories