ముహుర్తం కుదిరింది!

టాలీవుడ్‌ దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు  ఓ సినిమా చేయబోతున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి నుంచి ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్‌ బాబు సినిమా నుంచి అప్డేట్ రావొచ్చని.. చాలా కాలంగా సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని అభిమానులు ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది?, ఎప్పుడు విడుదల అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు.

అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా ఇంకా తెలియదు. ఎస్ఎస్‌ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ముందు నుంచి జక్కన్న చెబుతూనే ఉన్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ మాటే చెబుతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడినట్టుగా విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

 ఎస్ఎస్‌ఎంబీ 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. మహేష్-రాజమౌళి మూవీ 2025 జనవరిలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయన ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు… ఎస్ఎస్‌ఎంబీ 29 గురించి ఆయన్ని అడగ్గా జనవరిలో చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అటు మహేష్‌ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. ఇప్పటికే లాంగ్ హెయిర్, భారీ గడ్డంతో మహేష్ కనిపిస్తున్నారు. అలాగే బాడీ బిల్డ్ చేసే పనిలో కూడా పడ్డారు.ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిసెంబరు లోపు పూర్తి చేసి.. వచ్చే జనవరిలో సినిమా షూటింగ్ స్టార్ట్‌ చేయనున్నారంట. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు? అనేది చెప్పడం మాత్రం కష్టం.

Related Posts

Comments

spot_img

Recent Stories