వంశీ పైడిపల్లి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి చివరిగా తీసిన సినిమా తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘వారిసు’తో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత ఆయన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తారా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. అయితే, ఇప్పుడు ఈ విషయంపై సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త షికారు చేస్తోంది.

వంశీ పైడిపల్లి ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ హీరోతో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాడంట. ఇప్పటికే యంగ్ హీరోలు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌లతో టచ్‌లో ఉన్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అమీర్ కోసం ఓ భారీ కథను వంశీ పైడిపల్లి రెడీ చేస్తున్నాడని.. ఆయన దానికి ఓకే చెప్పగానే ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించేందుకు వంశీ రెడీ అవుతున్నాడనే టాక్ నడుస్తుంది.

ఇక ఈ సినిమాను అమీర్ ఓకే చేస్తే, పాన్ ఇండియా స్థాయిలో మరో బిగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని సినీ సిర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు అమీర్ ఖాన్ ఓకే చెబుతాడా.. లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories