ట్రెండ్‌ కి భిన్నంగా..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ మధ్యే కొరటాల శివతో దేవర అనే సినిమా చేసి సెన్సేషనల్‌ హిట్‌ కొట్టేశాడు. ముందు సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఫైనల్ గా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా పూర్తి కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా మీద ఫుల్‌ ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

 ఇప్పటికీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్‌ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి దాదాపుగా అన్ని సినిమాలను అయితే రెండు భాగాలుగా లేదా వీలైతే ఫ్రాంచైజ్ గా మార్చేచేందుకు ఎక్కువ మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి ప్రయోగాలు ఏమి లేకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని ఒక్క భాగానికి మాత్రమే పరిమితం అయ్యేలాగా ఒక్క కథగా ఉండేలా మాత్రమే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది

ప్రజెంట్ నడుస్తున్న ట్రెండుకు భిన్నంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, కావాలని ఇలా ఒక సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మేరకు ముందుకు వెళ్తున్నారని టాక్‌ నడుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు ఫైనల్ కాలేదు కానీ కన్నడ భామ రుక్మిణి వసంతను ఎంపిక చేస్తున్నారని ప్రచారం అయితే జోరుగా వినపడుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories