మిస్టర్‌ సెలబ్రిటీ ట్రైలర్‌ చూశారా!

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను స్వయంగా విడుదల చేశాడు. ఆర్‌పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ సినిమాకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి నటులు ముఖ్య పాత్రలను పోషించినట్లు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు విడుదలయ్యాయి. ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాయి. ట్రైలర్‌ చూసిన ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ట్రైలర్ విడుదల చేసిన రానా చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు.

సెలబ్రిటీగా మారాలనుకొనే యువకుడి కథగా ఇది రానున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రాబోతోందని సమాచారం. సెలెబ్రిటీ ట్రైలర్‌‌లో హీరో యాక్షన్, వినోద్ ఆర్ఆర్, శివకుమార్ కెమెరా వర్క్ ఈ సినిమాకి హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక విలన్ ఎవరన్నది చూపించలేదు. ఆ పాయింట్‌తో సినిమా మీద అందరిలోనూ ఆసక్తి మొదలవుతుందని డైరెక్టర్ ఆలోచన. 

Related Posts

Comments

spot_img

Recent Stories