అతన్ని చాలా మిస్‌ అవుతున్న అంటున్న సామ్‌!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. కొంత కాలం క్రితం ఆమెకు మయోసైటీస్ అనే వ్యాధి రావడంతో ఆమె చికిత్స తీసుకుంటూ పలు యాడ్స్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

అయితే సమంత చివరిగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటడెల్-హనీ బన్నీ’. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించగా.. రాజ్ డీకే డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ స్ట్రీమింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీని కోసం సామ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే మేకర్స్ నవంబర్‌లో ‘సిటాడెల్’ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తాజాగా, దీని ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సమంత ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది. ‘‘మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్’’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories