పెద్ద అప్డేట్‌ తోనే వస్తున్నాం!

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ ’ కాంబో లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ పొలిటికల్ డ్రామా, ప్రస్తుతం ఓ ప్రధాన ప్రకటన కోసం రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన విషయం గురించి తెలియజేస్తూ మేకర్స్ క్లారిటీ ఇస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఉత్తేజకరమైన అప్‌డేట్‌ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక అప్ డేట్ తో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ విడుదల తేదీని కూడా ఈ అప్‌ డేట్‌ లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్‌ గా చేస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories