కదన రంగంలోకి పవన్‌ కల్యాణ్‌!

ఏపీలో ఎన్నికల సమయంలో సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. దీంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ అన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే ఆగిపోయిన సినిమాల సంగతి ఏమిటని ఆ మధ్య టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.

షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని గతంలో పవన్ ఓ బహిరంగ సభలో ప్రకటించాడు. ఎప్పుడెప్పుడు ఆ రెండు సినిమాల షూట్ మొదలు అవుతుందా  అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. ఇటీవల తనను కలిసిన నిర్మాతలకు ఆ విషయంలో  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. పరిపాలన పరంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుని షూటింగ్ లో పాల్గొంటానని సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో విజయవాడలో అందుకు తగ్గ సెట్స్ ని కూడా మూవీ మేకర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుండి హరిహర వీరమల్లు షెడ్యూల్ మొదలు కానుంది.  హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ సారథ్యంలో భారీ యుద్ధ సాన్నివేశాలను పవను కళ్యాణ్ పై చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ ను ఇంతకూ ముందెప్పుడూ చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ. 

Related Posts

Comments

spot_img

Recent Stories