ఘాటీ పై తాజా సమాచారం ఏంటో తెలుసా!

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి బాహుబలి లాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత అనుష్క తనదైన మార్క్ లో సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది. మరి గతేడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో చేసిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాతో మంచి కం బ్యాక్ ని అనుష్క అందుకోగా ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో బిజీ అయ్యింది.

అయితే ఈ సినిమాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న చిత్రం “ఘాటీ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కొన్నాళ్ల కితమే షూటింగ్ మొదలు పెట్టగా… ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ అవుతున్నట్టు సమాచారం. మరి తాజాగా అనుష్క హైదరాబాద్ లో ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్టింగ్స్ లో షూట్ కి జాయిన్ అయ్యినట్టుగా సమాచారం.

దీంతో అనుష్కపై పలు ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ ని తీయనున్నారని సమాచారం.  “వేదం” తర్వాత అనుష్కతో క్రిష్ చేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories