ఈసారి జర్మనీలో..!

దర్శకధీరుడు రాజమౌళి -మహేష్‌ బాబు సినిమా ఎప్పుడూ మొదలు అవుతుందనే సందేహం ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఈ సినిమా కోసం అటు మహేష్‌ అభిమానులతో పాటు..ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి  చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది.

డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారని.. మొదటి షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో మొదలు పెట్టనునున్నట్లు ఓ టాక్‌ నడుస్తుంది. ఈ షెడ్యూల్ కి సంబంధించి త్వరలోనే యూనిట్ సభ్యులందరికి వర్క్ షాప్ కూడా నిర్వహించబోతున్నారంట.

కాగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో  అభిమానుల ముందుకు రానుంది.  2027 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని టాక్. ఇక, ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాల్సిందే. రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories