బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకలు…చిరు ఆసక్తికర కామెంట్స్‌!

టాలీవుడ్ మాస్ హీరోలకు దేవుడు నందమూరి బాలకృష్ణ. ఆయన పేరు తలచుకుంటేనే ఒక రకమైన ఎనర్జీ అభిమానుల్లో తన్నుకు వచ్చేస్తుంది. ఈ వయసులో  లో కూడా బాలయ్య 20 ఏళ్ల కుర్రాడిలా సాలిడ్ ఎనర్జీతో అభిమానులని అలరిస్తూనే ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసేసుకున్నారు. దీంతో అరుదైన మైలురాయిని అందుకున్న బాలయ్య కోసం అభిమానులు గ్రాండ్ గా స్వర్ణోత్సవ వేడుకలు జరుపగా అందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎందరో స్టార్స్ కూడా వచ్చారు.

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ మాట్లాడుతూ.. “బాలయ్య బాబు 50 సంవత్సరాల  వేడుకలో మేము భాగం అయినందుకు మేమంతా గర్వపడుతున్నాం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా ఉంది. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం.

ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ఎంతో ప్రత్యేకమైన  స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ చేస్తున్న పాత్రలు  ప్రేక్షకులను మెప్పించడం సాధారణమైన విషయం కాదు.  తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ఎంతో  ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి సినిమానే. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. అభిమానులు గొడవలు పడుతుంటారు. అభిమానుల కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం.

అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య కచ్చితంగా వస్తారు. అంతేకాకుండా అందరూ కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఇంకా హీరోగా నటిస్తున్న ఘనత బాలయ్యకే సొంతమైంది. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

రాజకీయ, వైద్య రంగాలలో బాలయ్య బాబు  సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంతాఒక కుటుంబం లాంటి వాళ్ళం, అభిమానులు అర్థం చేసుకోవాలో అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య” అంటూ మెగాస్టార్ కోరారు.

Related Posts

Comments

spot_img

Recent Stories