సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న డబుల్‌ ఇస్మార్ట్‌ !

యంగ్ అండ్ ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న గ్రాండ్ విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండటం.. బోల్డ్ డైలాగులు కూడా ఉండటంతో ఈ మూవీకి A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే, ఈ సినిమాలోని కంటెంట్ మాస్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రానికి 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలోని ట్విస్ట్ ఆడియెన్స్‌ను కచ్చితంగా థ్రిల్ చేస్తుందని వారు చెబుతున్నారు.

ఈ సినిమాలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories