వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను!

తొలివలపు సినిమాతో టాలీవుడ్‌ కి పరిచయమైన హీరో గోపిచంద్‌. ఈ సినిమా 2001 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో ఈ సినిమా 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే గోపిచంద్‌ కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తర్వాత జయం, నిజం, వర్షం లాంటి సినిమాలలో నెగిటివ్ పాత్రలు  చేసి మెప్పించాడు.

ఆ తర్వాత 2004లో విడుదలైన యజ్ఞం సినిమా తన కెరీర్ ను  మలుపు తిప్పింది. ఇక అప్పుడు నుంచి ప్రతి ఏడాది ఓ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు గోపీచంద్. ఈ క్రమంలోనే తాజాగా గోపీచంద్ తన 23 ఏళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నోట్ ను అభిమానుల ముందుకు తీసకుని వచ్చాడు. ఈ లేఖ లో తాను సినీ పరిశ్రమకు వచ్చి 23 సంవత్సరాలు గడిచిపోయాయని.. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న నా నిర్మాతలకు, దర్శకులకు, సహనటులు, సిబ్బంది అందరికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.

అలాగే నటుడిగా నేను అనుభవించిన ఈ ప్రయాణం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతగానో రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ నాకు చూపించిన నిరంతరం మద్దతు, ప్రోత్సాహానికి,  అలాగే మీడియా సభ్యులు, తెలుగు సినీ జర్నలిస్టులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఎల్లప్పుడూ నా కోసం మీరందరూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మీ మద్దతుకు, నా అభిమానులందరికీ పెద్ద చప్పట్లు అంటూ పేర్కొన్నాడు. మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుందని.. మీరందరూ ప్రతిరోజు నాకు అతి పెద్ద బలం అని త్వరలో విశ్వం సినిమాతో మిమ్మల్ని కలుస్తా అంటూ తెలియజేశాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories