ఆ ముగ్గురు యంగ్ హీరోల మల్టీ స్టారర్‌!

టాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌-ఏఎన్నాఆర్‌- కృష్ణ-శోభన్‌ బాబుల కాలం నుంచే మల్టీ స్టారర్‌ సినిమాలు రావడం కామనే. ఆ తరువాత వచ్చిన జనరేషన్‌ లో కూడా మల్టీస్టారర్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పటి తరంలో కూడా యంగ్‌ హీరోలు, సీనియర్‌ హీరోలు కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 , వాల్తేరు వీరయ్య..ఇలా చాలా సినిమాల లిస్టే ఉంది.

తాజాగా మ‌రో కొత్త కాంబోకి  టాలీవుడ్‌ లో తెర లేచింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ – విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ లు కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఓ ర‌కంగా ఇది మినీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా అనే చెప్పుకోవాలి.

 మంచు మనోజ్ ఈమ‌ధ్య విల‌న్ పాత్ర‌ల వైపు ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడు. ‘మిరాయ్‌’లో త‌ను విల‌న్‌. ఇవి కాకుండా మ‌రో రెండు సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల్లోనే నటించబోతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో మ‌రో సినిమా తాజాగా చేరిందనే చెప్పుకోవచ్చు. ‘నాంది’తో ఆక‌ట్టుకొన్న విజ‌య్ క‌న‌క‌మేడ‌ల మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ రెడీ చేసుకొన్న‌ట్టు ఇండస్ట్రీ టాక్‌. నిజానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది.

కానీ బెల్లంకొండ షెడ్యూల్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల అది సాధ్య పడలేదు. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధ‌మైంది.

Related Posts

Comments

spot_img

Recent Stories