మాజీ సీఎం మనవడితో డేటింగ్‌ లో అందాల భామ!

మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌ కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. మానుషి ఓ మాజీ సీఎం మనవడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు వీర్‌ పహారియాతో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

 సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓరీ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో మానుషి, వీర్‌ కలిసి కనిపించారు. వీర్‌ భుజంపై ఆమె సేదతీరుతూ కనిపించడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది. దీంతో వీర్‌తో మానుషి డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అనంత్ అంబానీ,  రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా మానుషి , వీర్‌ పహారియాలు కలిసే హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌, ఆమె ప్రియుడు శిఖర్‌ పహారియా కూడా ఈ పెళ్లి వేడుకలకు జంటగానే హాజరయ్యారు. వీర్‌ పహరియా, శిఖర్‌ పహరియాలు అన్నదమ్ములు. వీర్‌ నటుడిగా రాణిస్తుండగా.. అతడి సోదరుడు శిఖర్‌ పహారియా వ్యాపారవేత్త.

Related Posts

Comments

spot_img

Recent Stories