హైదరాబాద్‌ పార్క్‌ లో రాయన్‌ సందడి..ఎప్పుడంటే!

తమిళ సూపర్ స్టార్ ధనుష్ 50వ మైల్ స్టోన్ మూవీకి తానే దర్శకత్వం వహిస్తు, స్వయంగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన రాయన్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమాలో ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనున్నటు సమాచారం.

 ఈ చిత్రంలో ధనుష్ మేకోవర్ , యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉండనున్నాయని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాలో ధునుష్‌ పక్కన సందీప్‌ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా కనిపిస్తుంది. ఎస్ జే సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలలో యాక్ట్‌ చేస్తున్నారు. రామాయణం, మహాభారతం తరహా హై పాయింట్‌లను సినిమా అంతటా పొందుపరిచారని తెలుస్తుంది.

కాగా రాయన్ ను తమిళ్ తో తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాని విడుదల చేయనున్నాడు. షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ లో కూడా స్పీడ్‌ పెంచాడు ధనుష్. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 21న పార్క్ హయత్ హోటల్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరో ధనుష్ తో పాటు సందీప్ కిషన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం కంపోజ్‌ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories