తలైవాతో క్యూట్‌ ఫొటో షేర్‌ చేసిన పెదరాయుడు!

కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రజినీ నటిస్తున్న సినిమాలు దర్శకుడు టీజీ జ్ఞ్యానవేల్ తో “వేట్టైయాన్” అలాగే యంగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సాలిడ్ ప్రాజెక్ట్ “కూలీ” సినిమాలు చేస్తున్నారు.

మరి ఈ రెండు సినిమాలపై కూడా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా వీటిలో పలు రూమర్స్ కి చెక్ పెడుతూ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాపై అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా షూట్ కోసం రజినీకాంత్ హైదరాబాద్ కి వచ్చిన సగంతి తెలిసిందే. మరి ఈ క్రమంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుని రజిని కలవడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇద్దరు కూడా ఫ్లైట్ లో కలిసి ఓ ఫొటో దిగినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అందులో  రజినీకాంత్ మోహన్ బాబు భుజం పై చెయ్యి వేసి మరో చేత్తో మోహన్ బాబు గడ్డం పట్టుకొని ఎంతో ఆప్యాయంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఇప్పుడు ఈ లవ్లీ పిక్ వైరల్‌ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories