అంబటి, నీకూ చంద్రబాబు గారికి పోలికా ?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు ఎప్పుడు వారి అక్కసును వెళ్లగక్కుదామా..ఏ నాయకుడి మీద బురద జల్లుదామా అనే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడికి అర్థం కాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, అంబటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ”అంబటి.. నీకూ చంద్రబాబుకి పోలికా? ”అంటూ ఫైర్ అయ్యారు.

‘అసలు నీకు టీఎంసీ అంటే ఏంటో తెలుసా ? కాఫర్ డ్యాం ఎందుకు కడతారో తెలుసా ? కాఫర్ డ్యాం ఉపయోగం తెలుసా ? కాఫర్ డ్యాం అనేది పనులు అయ్యే వరకు కేవలం నదిని మళ్ళించటానికి. ఆ మళ్లింపునకి కాఫర్ డ్యాం ఒక్కటే సొల్యూషన్ కాదని, కాఫర్ డ్యాం లేకుండా పోలవరం కడతామని కేంద్రం చెప్పిన విషయాన్ని చంద్రబాబు గారు చెప్పారు’..అయినా, నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయిలే.. ఇది నీ సబ్జెక్ట్ కాదు, అన్నిట్లో దూరి అభాసుపాలు అవ్వకు.. మళ్ళీ సంజన దగ్గరకు వెళ్లి తలంటు పోసుకోవాలి’.. అంటూ అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు.

మరి ఇప్పటికైనా అంబటి తన బుద్ది మార్చుకుని ఏపీ ప్రభుత్వం మీద పిచ్చి రాతలు, పిచ్చి కూతలు రాయడం, కూయడం ఆపుతారో లేక మా తీరు ఇంతే..మా బతుకులు ఇంతే అనే రీతిగానే ఉంటాయో లేదో చూడాల్సిందే!

Related Posts

Comments

spot_img

Recent Stories