పరువు సీజన్‌ 2 కోసం వెయిట్‌ చేస్తున్న: మెగాస్టార్!

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన పరువు వెబ్ సిరీస్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ5 ఓటీటీ వేదికగా విడుదలై మంచి రేటింగ్‌ తో దూసుకెళ్తుంది. నివేదా పేతురాజ్‌, న‌రేష్ అగ‌స్త్య ప్రధాన పాత్రల్లో నటించిగా..  సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించారు. మెగా బ్రదర్ నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి లాంటి నటులు ఈ వెబ్‌ సిరీస్‌ లో కీలక పాత్రలు పోషించారు.

ప్రస్తుతం ‘పరువు’ వెబ్ సిరీస్ ఓ రేంజిలో వ్యూస్ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి పరువు వెబ్‌ సిరీస్ గురించి మాట్లాడారు.  ‘పరువు’ చిత్రబృందంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. “అద్భుత విజయాన్ని అందుకున్న ‘పరువు’ టీమ్ కు శుభాకాంక్షలు. అద్భుతమైన వెబ్ సిరీస్ ను నిర్మించిన సుస్మితను చూసి గర్వంగా ఉంది. సోదరుడు నాగబాబు మంచి నటనతో ఆకట్టుకున్నాడు.

ఒక ప్లాన్ తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, ఆ ఘటనతో ప్రమేయం లేని ఎమ్మెల్యే పాట్లు. లాస్ట్ కి ఈ జంట తప్పించుకుందా? లేదా? అని సీజన్2 లోనే చూడాలనుకుంటున్నాను!” అంటూ రాసుకొచ్చారు. పనిలో పనిగా ‘పరువు’ సీజన్ 2 ఉంటుందనిచెప్పకనే చెప్పేశారు మెగాస్టార్.     

Related Posts

Comments

spot_img

Recent Stories