మరోసారి కెవ్వు కేక అంటున్న హరీశ్‌ శంకర్‌!

ఇంతకు ముందులాగా సినిమాలకు ఆడియో రిలీజ్‌ ఫంక్షన్లు జరగడం లేదు. సోషల్‌ మీడియా ద్వారా పాటలను కొత్త సినిమాల నుంచి ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి చిత్ర బృందం. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి చేసిన సినిమా గబ్బర్ సింగ్ లో సాంగ్ ‘కెవ్వు కేక’ కూడా అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది.

ఆ పాట రచయితే  మరోసారి హరి శంకర్ అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమాకి అస్మైక యోగం అనే పాటను అందించారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి హరీష్ శంకర్, రచయిత సాహితి కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

“నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడనా….. నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా“ అంటూ సాగే సాహిత్యం లైన్స్ ని రాస్తూ.. రవితేజతో చేస్తున్న “మిస్టర్ బచ్చన్” కోసం తాను మరోసారి సాహితి గారితో వర్క్ చేయడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నా అంటూ వారి నుంచి కెవ్వు కేక, అస్మైక యోగం లాంటి  సూపర్‌ హిట్స్‌ ఆల్రెడీ ఉన్నాయని  గుర్తు చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories