మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత..ఆ స్టార్‌ హీరో సరసన నటిగా!

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత గతేడాది ఖుషీ సినిమా తరువాత సినిమాలకు చాలా గ్యాప్‌ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కాబోతోంది. ఇప్పటికే సామ్ తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తుంది.  అంతేకాకుండా తాజాగా ఓ బాలీవుడ్ ఆఫర్ కూడా అందుకుంది.

ఇక ఇప్పుడు మలయాళంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. సమంతను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేసిన కోలీవుడ్  డైరెక్టర్ గౌతమ్ మీనన్ సమంతను ఈసారి మాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. అక్కడ తొలి సినిమానే స్టార్ హీరో సరసన కనిపించనుందట. తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తొలిసారిగా మలయాళంలో సినిమా చేయబోతున్నాడు. ఇందులో మమ్ముట్టి కథానాయకుడిగా నటించి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు తాజా సమాచారం. అసలు ఈ సినిమాలో ఇంతకు ముందు  నయనతార  నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.

కానీ ఏమైందో మరీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సమంతను వెదుక్కుంటూ వచ్చింది.  సమంతకు కూడా మలయాళంలో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన బయటకు రానుంది. కాగా ఈ నెల 15వ తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories