శర్వానంద్‌ మనమే ట్రైలర్‌ వచ్చేసిందిగా..!

టాలీవుడ్ యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రం మనమే. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను శర్వానంద్ స్నేహితుడు ,గ్లోబల్ స్టార్ రాంచరణ్ విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా కథ అంత కూడా ఒక పిల్లాడి చుట్టూ తిరుగుతుందని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.అయితే ఆ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవడానికి శర్వానంద్ ,కృతి శెట్టి పడే కష్టాలను ట్రైలర్ లో ఎంతో ఎంటర్టైనింగ్ గా చూపించారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories