ప్రభాస్‌ అభిమానులకి షాకింగ్‌ న్యూస్‌..ఇక ఆ సినిమా లేనట్టేనా!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన సినిమా సలార్‌ సీజ్‌ ఫైర్‌ 1. గతేడాది చివరిలో విడుదల అయి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాను కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందించారు. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు.

ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన సలార్ సినిమాకు సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వము ఉంటుంది అని సలార్ మూవీ ఎండింగ్ లో నే చిత్ర బృందం తెలిపింది. అయితే మొన్నటి వరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి కాగానే సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తారక్‌  పుట్టిన రోజు సందర్భంగా తారక్‌ ,ప్రశాంత్ నీల్ కాంబో రానున్న మూవీ షూటింగ్ ఆగస్టు లో మొదలు పెట్టనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

దీనితోప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా  సలార్ 2 మూవీ ఆగిపోయినట్లు ఫిల్మ్ వర్గాల నుండి సమాచారం..ప్రశాంత్ ,ప్రభాస్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు అంతా అనుకుంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు కమిట్ అవ్వడంతో ఈ ఏడాది ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో బిజీ గా ఉండనున్నట్లు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories