రెండు క్లైమాక్స్ లతో వస్తున్న చైతూ సినిమా!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా ధూత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అక్కినేని నాగచైతన్య – చందు మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా తండేల్. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది..ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లను పిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. అదేంటి సినిమాకు మాములుగా ఒక క్లైమాక్స్ ఉంటుంది. మరి ఈ సినిమాకు రెండేందుకు అనుకుంటున్నారా? తండేల్ కోసం రెండు క్లైమాక్స్ లు పరిశీలనలో ఉన్నాయట. చైతు సాయిపల్లవిల మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద ప్రస్తుతానికి చందు మొండేటి రెండు క్లైమాక్స్ లు రాసుకున్నారట. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద లోతుగా ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటారని టాక్.. వీరిద్దరి చివరి షాట్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుదని తెలుస్తుంది..

గ్రామీణ ప్రేమకథ తండేల్ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ .  గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్నిభారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..

Related Posts

Comments

spot_img

Recent Stories