సలార్‌ 2 గురించి స్టార్ నటుడి కీలక వ్యాఖ్యలు!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన సలార్‌ పార్ట్‌ 1 గతేడాది డిసెంబర్‌ లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమాలో  మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.   కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది . అతి త్వరలోనే ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’ షూటింగ్ మొదలు కాబోతుంది.

ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ,శివ మన్నార్ అనే రెండు పాత్రలు చేసారు.అయితే శివ మన్నార్ పాత్ర సలార్ లో మాత్రమే కాకుండా వేరే యూనివర్స్‌లో కూడా ఉంటుందని పృథ్వి తెలిపారు.శివమన్నార్ కథ ఎంతో కూల్‍గా ఉంటుందని పృథ్విరాజ్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో.. శివమన్నార్ స్టోరీ ఎంతో కూలెస్ట్ అనిపించింది. మరో యూనివర్స్‌ తో నమ్మలేని విధంగా క్రాస్ ఓవర్ ఉంటుందని ” ట్వి్‌ లో రాసుకోచ్చారు.

దీంతో సలార్ మూవీకి  నీల్ వేరే సినిమాకి  లింక్ ఉండనుందని తెలుస్తుంది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా వున్నారు.అయితే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‍లో రానున్న చిత్రంతోనే సలార్‌ సినిమాకు లింక్ ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories