ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన బాలీవుడ్ ముద్దుగుమ్మ!

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే..లైగర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సినిమా హిట్‌ అవ్వకపోయినా ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా ఈ భామ తన ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పినట్లు టాక్‌ నడుస్తుంది.  అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ విడిపోయారని చాలా కాలంగా టాక్ వినిపిస్తుంది. మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ దాదాపు నెల రోజుల క్రితమే విడిపోయినట్లు తెలుస్తుంది.

 వీళ్ల బ్రేకప్ వార్త వారి స్నేహితులను కూడా షాక్ కి గురి చేసిందని తెలుస్తుంది. ఈ ఇద్దరి సన్నిహితుడు ఒకరు వీరు నెల రోజుల క్రితం విడిపోయారని ఇటీవల పేర్కొన్నారు.  ఆదిత్య రాయ్ కపూర్,   అనన్య పాండేల స్నేహితుడు, ‘వారు ఒక నెల క్రితం విడిపోయారు, వారు చాలా బాగా కలిసి ఉండేవారు కానీ విడిపోవడం మా అందరికీ షాక్ ఇచ్చింది. వారు ఒకరికొకరు చాలా మంచివారు. అనన్య మూవ్ ఆన్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది, ఇప్పుడు అయితే ఆమె కచ్చితంగా గాయపడిందనే చెప్పాలి అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

ఆదిత్య కూడా పరిస్థితిని డీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించారు. ఇక ఆదిత్య, అనన్య దాదాపు రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. గత నెలలో, అనన్య పోస్ట్ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ తర్వాతనే  వీరిద్దరూ తమ బంధానికి వీడ్కోలు తెలిపినట్లు  ఊహాగానాలు వచ్చాయి. అయితే నిజానికి వారిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వార్తల ప్రకారం ఇద్దరూ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే ఇద్దరూ కూడా  వారి  బ్రేకప్ వార్తలపై మౌనం వహిస్తున్నారు.

ఇక అనన్య తన పోస్ట్‌లో ఇలా పేర్కొంది, ‘ఇది నిజంగా మీ కోసం అయితే, అది మీకు తిరిగి వస్తుంది. ఇఇది నిజంగా మీ కోసం ఉద్దేశించబడినట్లయితే, మీరు దానిని దూరంగా నెట్టివేసినప్పటికీ, మీరు తిరస్కరణకు గురైనప్పటికీ, అంత అందమైనది నిజంగా మీది కాదని మీరు విశ్వసించినప్పటికీ, అది తిరిగి వస్తుంది అంటూ వేదాంత ధోరణిలో ఓ పోస్ట్ పెట్టింది.దీనిని చూసిన నెటిజన్లు వీరిద్దరూ విడిపోయినట్లు కన్ఫామ్‌ చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories