రూట్‌ మార్చిన కొండన్న..ఈసారి వర్కౌట్ అవుతుందా!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. సినిమా పెద్దగా హిట్‌ కాకపోయినప్పటికీ ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. విజయ్‌ తాజాగా మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం విజయ్‌ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న యాక్షన్ డ్రామా సినిమా పై దృష్టి పెట్టాడు.  ఈ చిత్రంలో పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.విజయ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం విజయ్ కొత్త ప్రయోగం చేస్తున్నాడంట. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట.

ఏదైనా సినిమా విజయం అందుకోవాలంటే అందులో పాటలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటిది విజయ్‌ సినిమాలో మాత్రం ఓ పాట కూడా ఉండదట. ఇప్పటివరకు విజయ్ సినిమాల్లో పాటలు సూపర్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. మరి అసలు పాటలు లేకుండా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా ‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజుని తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే మరోవైపు రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. 

Related Posts

Comments

spot_img

Recent Stories