ఆ రోజు తారక్‌ అభిమానులకు ట్రిపుల్‌ బొనాంజా!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా , స్టార్‌ డైరెక్టర్‌  కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా చేస్తుంది. ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ సంస్థలు గ్రాండ్‌ గా పాన్‌ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాని దసరా కానుకగా  అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. మరోవైపు తారక్‌ తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 మూవీ కూడా చేస్తున్నారు.  వీటి తరువాత ప్రశాంత్ నీల్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ప్రతిష్టాత్మక మూవీ చేయనున్నట్లు సమాచారం.

అసలు విషయం ఏంటంటే..  మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మొత్తం ఈ మూడు సినిమాల నుంచి కూడా మూడు అప్ డేట్స్ రిలీజ్ కానున్నట్లు టాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఆ రోజున వార్ 2 నుండి ఫస్ట్ లుక్, దేవర మొదటి సింగిల్ అప్ డేట్ తో పాటు ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఒకటి రానుంది. . ఈ విధంగా ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆయన ఫ్యాన్స్ కి ట్రిపుల్ బొనాంజా ఖాయం అని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories