మీ అందరికీ మాట ఇస్తున్నా…!

ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్‌ ని తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమా తరువాత  ప్ర‌శాంత్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్‌లో భాగంగా వస్తోన్న తరువాతి చిత్రం జై హ‌నుమాన్ . ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్‌ కాగా  తాజాగా  శ్రీరామ‌న‌మి సంద‌ర్భంగా సినిమా నుంచి ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ విడుద‌ల చేశారు.

ఇప్పుడు ఈ పోస్ట‌ర్ సోషల్‌ మీడియాలో  విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ.. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు చిత్ర అభిమానులందరికీ మాటిస్తున్నాను. వచ్చే జై హనుమాన్‌ సినిమా ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే మంచి అనుభూతిని అందిస్తానని మాటిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పోస్టుకు హనుమంతుడు రాముల వారికి మాటిచ్చే పోస్టర్‌ ను ట్యాగ్‌ చేశారు.  ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా టాలీవుడ్ అగ్ర న‌టుడు లీడ్ రోల్‌లో న‌టించ‌నున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories