ఎన్నికలు పూర్తవగానే మొదలు!

నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోకు ఉన్న క్రేజ్‌ అంత ఇంత కాదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మాస్‌ మూవీస్‌    ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టాయి.  అసలు ఆ కాంబోలో సినిమా అంటే బాలయ్య అభిమానులకు మామూలు పండుగ కాదు.

 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు వీరిద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ మీద ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘అఖండ-2’  కూడా ఉంటుందని బోయపాటి ఇంతకు ముందే చెప్పారు. తాజాగా ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి నడుస్తోంది.  ఎన్నికలు పూర్తి కాగానే  ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది.

 ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక  భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని బోయపాటి అన్నారు. ఈ చిత్రం  స్క్రిప్ట్  వర్క్‌ ఇప్పటికే మొదలైనట్లు బోయపాటి సన్నిహితుల ద్వారా సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శరవేగంగా దీని షూటింగ్‌ జరుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories