కొండన్న బంగారు కొండే!

రౌడీ హీరో ..ఫ్యామిలీ హీరోగా మారి ఏప్రిల్‌ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ స్టార్‌ సినిమా కోసం చిత్ర బృందం చాలా కష్టపడుతుంది. షూటింగ్‌ పూర్తై రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన రోజు నుంచే చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌ లో ఫుల్‌ బిజీగా ఉంది. రెండు రోజుల క్రితం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను చాలా వేడుకగా చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తెలుగు సహా తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న క్రమం లో ఈ సినిమాని చెన్నై కూడా వెళ్లి ప్రమోట్ చేసి వచ్చారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు- శిరీష్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

కాగా తాజాగా  ప్రమోషన్స్ లో ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ సినిమాని ప్రమోట్ చేస్తున్న సమయంలోనే మరో సినిమా యూనిట్ కూడా ఆయనకు ఎదురుపడింది. ఆయూనిట్‌ ప్రమోట్‌ చేసుకుంటున్న సినిమా పేరు బహుముఖం. ఈ సినిమాని
హర్షివ్ కార్తీక్ అనే ఒక ఎన్నారై సినిమా మీద ఫ్యాషన్ తో  24 క్రాఫ్ట్స్ లో 15 విభాగాలు ఆయనే మేనేజ్ చేసి ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా కూడా చిన్న సినిమాగా ఏప్రిల్ 5వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ వెంటనే మా ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు ఈ బహుముఖం సినిమా కూడా చూడండి. హీరో ఎంతో కష్టపడుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు మా కొండన్న నిజంగానే బంగారు కొండ లేకపోతే అదే రోజు సినిమా రిలీజ్ అవుతుంటే వేరే సినిమా కూడా చూడమని ఏ హీరో అయినా చెబుతాడా అంటూ మురిసిపోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories