పెట్టుబడి పాయెనే.. గొల్లుమంటున్న వైసీపీ కేండేట్లు!

వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఉండే ఓటర్లందరినీ ప్రలోభ పెడతారని.. ఓటర్లకు డబ్బు పంచడంలోనూ తాయిలాలు పంచడంలోనూ కూడా వారు బాగా ఉపయోగపడతారని వైసీపీ అభ్యర్థులు చాలా చాలా కలలు కన్నారు. వాలంటీర్ల మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈసీ ఆదేశాలతో పరిస్థితి మొత్తం తిరగబడింది. వాలంటీర్లను నమ్ముకుని, వారిద్వారా ఓటర్లకు ప్రలోభాలను నమ్ముకుని గెలుద్దాంలే అని ధీమాగా గడిపిన వారు ఇప్పుడు కిందామీదా అవుతున్నారు. వాలంటీర్ల మీద పెట్టుకున్న  ఆశలే కాదు కదా.. వారిమీద పెట్టిన పెట్టుబడి కూడా దండగైపోయిందని విలపిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రసh పార్టీ నాయకులు తొలినుంచి వాలంటీర్లనే నమ్ముకున్నారు. జగన్ చేసే పనులు, అందించే డబ్బుల కంటె.. వాటి గురించి.. ఇంటింటికీ వెళ్లి డప్పు కొట్టి చెప్పే, జగన్ కు ఓటు వేయకపోతే ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయని భయపెట్టే వాలంటీర్ల మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యారు. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి నానా పాట్లు పడ్డారు. వాలంటీర్లు అందరితో మీటింగులు పెట్టుకుని ఒక్కొక్కరికి పదేసి వేల రూపాయలకుపైగా నగదు ఆమ్యామ్యాలు సమర్పించుకున్నారు. వారికి చాలా ఖరీదైన స్మార్ట్ ఫోన్లు అటువంటి ఇతర కానుకలు కొని ఇచ్చారు. వారికి చాలా హామీలు కూడా ఇచ్చారు. ఈ రెండు నెలల పాటూ వారి జీతానికి అదనంగా పెద్దమొత్తాలు ఇస్తామని కూడా లోపాయికారీగా ఒప్పుకున్నారు. కానీ చివరికి ఇప్పుడు వాలంటీర్లు సీన్లోనే లేకుండాపోయారు.

పింఛన్ల మిషమీద వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి.. ఓటర్లను మాయచేసే అవకాశం జారిపోయింది. వాలంటీర్లు తమ కార్యకర్తలే అయినప్పటికీ, తమకు అనుకూలంగా పనిచేసే వారే అయినప్పటికీ.. వారు కేవలం ఇంటికి పరిమితమైపోయే పరిస్థితి. బోలెడంత డబ్బు ఖర్చు చేసి వారి మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయిపోయిందే..  అనే బాధ ఇప్పుడు వైసీపీ అభ్యర్థులకు పట్టుకుంది.

వాలంటీర్లను ఇతర రకాలుగా వాడుకోవాలని ఇప్పుడు వారంతా తెగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకోమని చెప్పిన నేపథ్యంలో.. పెన్షనర్లు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఈ ఇబ్బందులు అన్నింటికీ.. చంద్రబాబునాయుడే కారణం అని చెప్పాలని కుట్రలుపన్నుతున్నారు. చంద్రబాబునాయుడు ఒకవైపు ఎండలో వారిని సచివాలయాలకు రమ్మని చెప్పడం కరెక్టు కాదు.. ఇళ్ల వద్దకే పింఛను పంపండి అని చెబుతున్నా వినిపించుకోని సర్కారు అదే దుర్మార్గానికి పాల్పడుతోంది. వాలంటీర్ల ద్వారా బాబు వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories