ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు బైక్‌ మీద వచ్చిన హీరోహీరోయిన్లు!

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా  ఏడాది సంక్రాంతి కే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాని ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ చేస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది అని సినిమా యూనిట్ చెబుతోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మైసమ్మగూడలో ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతో వేడుకగా చిత్ర బృందం నిర్వహించింది. ఈ ఈవెంట్ కి  నిర్మాత దిల్ రాజు, శిరీష్ హాజరయ్యారు. దిల్ రాజు భార్య వైఘా రెడ్డి కూడా ఈవెంట్ కి హాజరై స్పెషల్ అట్రాక్షన్‌ గా నిలిచింది. అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే విజయ్ , మృణాల్  ఇద్దరూ కూడా బైక్ మీద వేదిక వద్దకు చేరుకున్నారు.

సినిమాలో ఏదైతే బైక్ వాడారో అదే బైక్ మీద ఈ ఇద్దరూ వేదిక వద్దకు రావడం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది. విజయ్‌ కి ముందు నుంచి కూడా తన సినిమాలకు వినూత్నంగా ప్రమోట్‌ చేసే అలవాటు ఉంది. ఈ సినిమా కి కూడా విజయ్  అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు వేదిక వద్దకు బైక్ మీద రావడం హాట్ టాపిక్ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories